హెదరాబాద్‌లో వందల మందికి ఉపాధి... మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి !

హైదరాబాద్‌ జీనోమ్ వ్యాలీలో తమ వ్యాపార కార్యకలపాలు విస్తరిస్తున్నట్లు 'గ్లాండ్ ఫార్మా' సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఆ మేరకు కేటీఆర్‌తో భేటీ అయిన ప్రతినిధులు.. కంపెనీ విస్తరణ ద్వారా 500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

Minister KTR: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే అనేక ఇంటర్నేషనల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. తాజాగా.. మరో ఫార్మా దిగ్గజం హైదరాబాద్‌లో తన పెట్టుబడులు విస్తరించేందుకు రెడీ అయింది.

హైదరాబాద్‌ జీనోమ్ వ్యాలీలో తమ కార్యకలపాలు విస్తరిస్తున్నట్లు 'గ్లాండ్ ఫార్మా' ప్రతినిధులు వెల్లడించారు. జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తమ కంపెనీ విస్తరణతో మరో 500 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ (KTR)తో సంస్థ ప్రతనిధులు భేటీ అయ్యారు.

గ్లాండ్ ఫార్మా తన పెట్టుబడులు విస్తరించనుండటంపై ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం లైఫ్ సెన్సెస్, జీనోమ్ వ్యాలీ శక్తి రోజురోజుకు పెరుగుతోందని అన్నారు. కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడితో బయాలజికల్స్‌ లాంటి అడ్వాన్స్‌ ఏరియాల్లో 500 ఉద్యోగాల సృష్టి జరుగనుందని కేటీఆర్ ట్వీట్టర్‌లో వెల్లడించారు.

దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌ కూడా తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆ సంస్థతో ఎంవోయూ ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు మహీంద్రా కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎలక్ట్రిక్ 3- వీలర్, 4- వీలర్ వాహనాల అభివృద్ధి, తయారీ కోసం మానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పనుందేందు సిద్ధమైంది.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ మొబిలిటీ వ్యాలీ' ప్రకటన నేపథ్యంలో మహీంద్రా కంపెనీ ఈ ఫెసిలిటీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించింది. దాదాపు ఈ ప్రాజెక్ట్ కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జేజురికర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1000 మంది వరకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని తెలిపారు.