
హైదరాబాద్కి ఓకే చెప్పిన గ్రిడ్ డైనమిక్స్
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్న గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ఇండియాలో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇందు కోసం హైదరాబాద్లో భారీ ఎత్తున నియమకాలు చేపట్టనుంది. ఈ విషయాన్ని రాష్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తెలిపారు.
గ్రిడ్ డైనమిక్స్ సీఈవో లియోనార్డో లివ్షిట్జ్ ఈరోజు మంత్రి కేటీఆర్ను కలిశారు. సంస్థ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను ఇరువరు చర్చించారు. త్వరలోనే ఆఫీసు ప్రారంభించి ఈ ఏడాది చివరి నాటికి వెయ్యి మంది వర్క్ఫోర్స్తో పనులు నిర్వహిస్తామని గ్రిడ్ డైనమిక్స్ తెలిపింది. అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో గ్రిడ్ డైనమిక్స్ సంస్థ డిజటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో పని చేస్తోంది.