
అమిత్ షా ఈరోజు హైదరాబాద్ రానున్నారు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈరోజు సాయంత్రం షా హైదరాబాద్లో దిగనున్నారు. రాత్రి 9.50 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని శుక్రవారం రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో బస చేస్తారు. శనివారం ఉదయం 8.45 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్న షా 11.45 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్లో ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ‘విమోచన దినోత్సవం’ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం నగరంలోని టూరిజం ప్లాజాలో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్స్కు వెళ్లి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వికలాంగులకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి చేతుల మీదుగా పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పోలీసు అకాడమీకి వెళ్లి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు షా న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.